దూసుకెళ్తున్న యూపీఐ.. మరో మైలురాయి దాటిన డిజిటల్ పేమెంట్లు
- ఏప్రిల్లోనూ కొనసాగిన డిజిటల్ చెల్లింపుల వృద్ధి
- 22.35 బిలియన్ల లావాదేవీలతో రూ.29.03 లక్షల కోట్ల వ్యాపారం
- పదేళ్లలో 12,000 రెట్లు పెరిగిన యూపీఐ లావాదేవీల సంఖ్య
- ఎనిమిదికి పైగా దేశాలకు విస్తరించిన యూపీఐ సేవలు
భారత్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ తన అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో లావాదేవీల సంఖ్య, విలువ పరంగా గణనీయమైన వృద్ధి నమోదైంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్లో దేశవ్యాప్తంగా 22.35 బిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.29.03 లక్షల కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే లావాదేవీల సంఖ్యలో 25%, విలువలో 21% వృద్ధి కనిపించింది.
రోజువారీ లావాదేవీల పరంగా కూడా ఈ వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. మార్చిలో రోజుకు సగటున 730 మిలియన్ల లావాదేవీలు జరగగా, ఏప్రిల్లో ఈ సంఖ్య 745 మిలియన్లకు పెరిగింది. అలాగే, రోజువారీ లావాదేవీల సగటు విలువ రూ.95,243 కోట్ల నుంచి రూ.96,766 కోట్లకు చేరింది. ఇదే నెలలో ఐఎంపీఎస్ ద్వారా 362 మిలియన్ల లావాదేవీలు జరగ్గా, వాటి విలువ రూ.7.01 లక్షల కోట్లుగా నమోదైంది.
భారత్ గర్వించదగ్గ యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) సేవలు కేవలం దేశానికే పరిమితం కాలేదు. ఇప్పటికే యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్ సహా 8కి పైగా దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ అంతర్జాతీయ విస్తరణ ద్వారా విదేశాల నుంచి డబ్బు పంపడం సులభతరం అవ్వడమే కాకుండా, ప్రపంచ ఫిన్టెక్ రంగంలో భారత్ స్థానం మరింత పటిష్ఠమవుతోంది.
యూపీఐకి ఐఎంఎఫ్ గుర్తింపు
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం గత దశాబ్ద కాలంలో యూపీఐ లావాదేవీల సంఖ్యలో దాదాపు 12,000 రెట్ల వృద్ధి నమోదైంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 కోట్ల లావాదేవీలు జరగ్గా, 2025-26 నాటికి ఆ సంఖ్య 24,162 కోట్లకు చేరింది. ఇదే సమయంలో లావాదేవీల విలువ రూ.0.07 లక్షల కోట్ల నుంచి రూ.314 లక్షల కోట్లకు పెరిగి, 4,000 రెట్ల వృద్ధిని నమోదు చేసింది. యూపీఐ పనితీరు, విశ్వసనీయత కారణంగా భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. లావాదేవీల సంఖ్య పరంగా యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ పేమెంట్ సిస్టమ్ అని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సైతం గుర్తించింది.
రోజువారీ లావాదేవీల పరంగా కూడా ఈ వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. మార్చిలో రోజుకు సగటున 730 మిలియన్ల లావాదేవీలు జరగగా, ఏప్రిల్లో ఈ సంఖ్య 745 మిలియన్లకు పెరిగింది. అలాగే, రోజువారీ లావాదేవీల సగటు విలువ రూ.95,243 కోట్ల నుంచి రూ.96,766 కోట్లకు చేరింది. ఇదే నెలలో ఐఎంపీఎస్ ద్వారా 362 మిలియన్ల లావాదేవీలు జరగ్గా, వాటి విలువ రూ.7.01 లక్షల కోట్లుగా నమోదైంది.
భారత్ గర్వించదగ్గ యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) సేవలు కేవలం దేశానికే పరిమితం కాలేదు. ఇప్పటికే యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్ సహా 8కి పైగా దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ అంతర్జాతీయ విస్తరణ ద్వారా విదేశాల నుంచి డబ్బు పంపడం సులభతరం అవ్వడమే కాకుండా, ప్రపంచ ఫిన్టెక్ రంగంలో భారత్ స్థానం మరింత పటిష్ఠమవుతోంది.
యూపీఐకి ఐఎంఎఫ్ గుర్తింపు
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం గత దశాబ్ద కాలంలో యూపీఐ లావాదేవీల సంఖ్యలో దాదాపు 12,000 రెట్ల వృద్ధి నమోదైంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 కోట్ల లావాదేవీలు జరగ్గా, 2025-26 నాటికి ఆ సంఖ్య 24,162 కోట్లకు చేరింది. ఇదే సమయంలో లావాదేవీల విలువ రూ.0.07 లక్షల కోట్ల నుంచి రూ.314 లక్షల కోట్లకు పెరిగి, 4,000 రెట్ల వృద్ధిని నమోదు చేసింది. యూపీఐ పనితీరు, విశ్వసనీయత కారణంగా భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. లావాదేవీల సంఖ్య పరంగా యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ పేమెంట్ సిస్టమ్ అని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సైతం గుర్తించింది.