పాక్ గగనతలం మూసివేత రేపటి వరకు పొడిగింపు
- భారత వైమానిక దాడి తర్వాత పాక్ నిర్ణయం
- తొలుత 9న తిరిగి తెరవనున్నట్టు ప్రకటన
- అంతలోనే మరో ప్రకటన చేసిన సివిల్ ఏవియేషన్
సోమవారం (11వ తేదీ) మధ్యాహ్నం మూడు గంటల వరకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్టు పాక్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. అంతర్జాతీయ ట్రాన్సిట్ విమానాలు తమ భూభాగంలో ప్రవేశించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే, ఉత్తర, దక్షిణ మార్గాల ద్వారా ముందుగా నిర్ణయించిన విమానాలకు మాత్రం అనుమతి ఉన్నట్లు తెలిపింది.