Andhra Pradesh: ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డి!

  • అసమర్థుడైన ఉమకు పీడకలలు వస్తుంటాయి
  • అందుకే ఇడుపులపాయకు రాజధాని పోతుందంటున్నారు
  • గ్రాఫిక్స్ భ్రాంతి నుంచి బయటకు రావాలని హితవు
ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఉమ అనే అసమర్థుడైన మంత్రికి ఎప్పుడూ పీడకలలు వస్తుంటాయని ఎద్దేవా చేశారు. ఇంకొకరు రాజధానిని మార్చాలంటే ముందుగా కట్టితీరాలని వ్యాఖ్యానించారు. గ్రాఫిక్స్ భ్రాంతి నుంచి ఇప్పటికైనా బయటకు రావాలని హితవు పలికారు.

ఈరోజు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఉమ అనే అసమర్థ మంత్రికి ఎప్పుడూ పీడ కలలు వస్తుంటాయి. రాజధాని ఇడుపులపాయకు తరలిపోతుందని కొత్త కల కన్నాడు. మీరు అసలు రాజధాని కడితే గదా ఇంకొకరు మార్చేది. అమరావతిలోని రాజధాని నిర్మిస్తాం. గ్రాఫిక్స్ భ్రాంతిలోనుంచి బయటకు రా ఉమా!’అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Telugudesam
uma
YSRCP
Vijay Sai Reddy
Twitter

More Telugu News