మోదీకి వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- పలు జిల్లాల్లో టీడీపీ నిరసనలు
- పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు
- విశాఖలో మోదీకి వ్యతిరేక హోర్డింగ్స్
విశాఖ పట్టణంలో మోదీకి వ్యతిరేకంగా పలు హోర్డింగ్స్ ఏర్పాటు అయ్యాయి. జీవీఎంసీ వద్ద మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా, కిడారి శ్రవణ్ లు నిరసనకు దిగారు. ఇదే ప్రాంతంలో ప్రత్యేక హోదా సాధన సమితి కూడా నిరసనలు తెలిపింది. విజయవాడలో తెలుగు యువత కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి వీధుల్లోకి వచ్చారు. మోదీకి వ్యతిరేక నినాదాలు చేశారు. బెంజ్ సర్కిల్ వద్ద దేవినేని అవినాష్ రాస్తారోకో నిర్వహించారు. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించగా, నెల్లూరు, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల్లో టీడీపీ నేతలు ధర్మపోరాట దీక్షలు చేశారు.