భారత వాయుసేన దాడిలో హతమైన 42 మంది సూసైడ్ బాంబర్లు... ఫోన్ నంబర్లు సహా వారి వివరాలు ఇవిగో!

  • నిన్నటి బాలాకోట్ దాడిలో 350 మంది ఉగ్రవాదుల హతం
  • సూసైడ్ బాంబర్ల వివరాలను వెల్లడించిన జీ న్యూస్
  • రావల్పిండి ఆసుపత్రిలో దాక్కున్న మసూద్ అజార్
నిన్న తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో పాక్ ప్రధాన భూభాగంలో ఉన్న జైషే మొహమ్మద్ కు చెందిన బాలాకోట్ టెర్రర్ క్యాంప్ పై భారత వాయుసేన దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 350 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయినట్టు సమాచారం. చనిపోయిన వారిలో 42 మంది శిక్షణ పొందిన సూసైడ్ బాంబర్లు ఉన్నారని జీ న్యూస్ ఓ కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు వారి పేర్లు, పుట్టిన తేదీ, అడ్రస్, ఫోన్ నంబర్లను కూడా వెల్లడించింది. ఈ 42 మందిలో 14 మంది రావల్పిండి, అటోక్ కు చెందినవారు కావడం గమనార్హం. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ ది రావల్పిండి జిల్లానే. రావల్పిండి మిలిటరీ ఆసుపత్రిలోనే ప్రస్తుతం అతను దాక్కున్నట్టు సమాచారం.
Go Back to Shorts
balakot
air strikes
suicide bombers
list

More Telugu News