దేవుడ్ని కాసేపు పక్కన పెట్టి దేశం గురించి ఆలోచించండి: శివసేన
- నినాదాన్ని మార్చుకున్న శివసేన
- ఆరెస్సెస్ నిర్ణయానికి మద్దతు
- మహాకూటమిపై విమర్శలు
పుల్వామా లాంటి దాడులను తిప్పికొట్టాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలని, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి వల్ల అది సాధ్యం కాదని తేల్చి చెప్పింది. బలమైన నాయకుడితోపాటు స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడే ఉగ్రవాదాన్ని నిర్మూలించి, పాకిస్థాన్కు తగిన బుద్ధి చెప్పగలమని అభిప్రాయపడింది.
ఈ ఐదేళ్లలో పాకిస్థాన్ పై కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది. గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతంగా ప్రస్తుతం కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదాన్ని నిలువరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని శివసేన ఆరోపించింది.