కేంద్ర ప్రభుత్వం వెంట ఉంటాం.. వేరే చర్చ అనవసరం: రాహుల్ గాంధీ
- జవాన్లపై జరిగిన దాడి చాలా ఘోరమైనది
- రాజకీయాల గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదు
- భారత్ ను ఏ శక్తి విచ్ఛిన్నం చేయలేదు
జవాన్లపై జరిగిన దాడి చాలా ఘోరమైనదని చెప్పారు. భద్రతాదళాలపై జరిగిన దారుణమైన హింస మనసును కలచివేస్తోందని అన్నారు. భారత్ ను ఏ శక్తి కూడా విచ్ఛిన్నం చేయలేదని చెప్పారు. మనం ఎంతో ప్రేమించే వ్యక్తుల మరణం గురించి తప్ప ఇతర విషయాల గురించి తాను మాట్లాడనని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో రానున్న కొన్ని రోజుల వరకు తాము ప్రభుత్వం వెంటే ఉంటామని చెప్పారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, టెర్రరిజంను అందరం కలసి ఒక దేశంగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు.