టీడీపీలో చేరిన నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు.. కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు
- ఏపీ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు మరో ఐదేళ్లు ఉండాలి
- పట్టిసీమతో రాయలసీమ దశదిశ మారింది
- ఎన్టీఆర్, కృష్ణ అభిమానులు కలిసి టీడీపీని గెలిపించాలి
శేషగిరిరావు మాట్లాడుతూ.. చంద్రబాబు ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమ దశదిశ మారిందని, ఏపీ ఇంకా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని అన్నారు. ఎన్టీఆర్, కృష్ణ అభిమానులు కలిసి టీడీపీని గెలిపించాలని ఆదిశేషగిరిరావు కోరారు.