భారీ స్కోరు దిశగా భారత్.. రాణించిన ఓపెనర్లు
- న్యూజిలాండ్తో రెండో వన్డే
- తొలి వికెట్కు 154 పరుగుల భాగస్వామ్యం
- రెండు వికెట్లు కోల్పోయిన భారత్
ధవన్ అవుటైనా జోరు తగ్గించని రోహిత్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సెంచరీకి చేరువవుతున్న క్రమంలో లాకీ బౌలింగ్లో అవుటయ్యాడు. 96 బంతులు ఆడిన రోహిత్ 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. వన్డేల్లో రోహిత్కు ఇది 38వ అర్ధ సెంచరీ. ప్రస్తుతం 34 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ 22, అంబటి రాయుడు 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.