vangaveeti radhakrishna: రంగా హత్యను టీడీపీకి ఆపాదించవద్దు: వంగవీటి రాధా

  • రంగా హత్య కొందరు వ్యక్తుల పని
  • హత్యతో టీడీపీకి సంబంధం లేదు
  • పార్టీ కోసం పని చేస్తున్న వారిని జగన్ గౌరవించాలి
వైసీపీకి గుడ్ బై చెప్పిన వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగా హత్య కొందరు వ్యక్తుల పని అని... ఈ హత్యకు టీడీపీకి సంబంధం లేదని అన్నారు. రంగా హత్యను టీడీపీకి ఆపాదించొద్దని చెప్పారు. తాను వైసీపీతో కలిసే పనిచేయాలనుకున్నానని...కానీ సర్వం నేనే, అందరూ నా కింద పనిచేయాల్సిందే అన్నట్టుగా మీరు ప్రవర్తించారని వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్ ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకొని పార్టీ కోసం పని చేస్తున్నవారిని గౌరవించాలని సూచించారు. తనకు జరిగినన్ని అవమానాలు మరెవరికీ జరగకూడదని చెప్పారు.
vangaveeti radhakrishna
ranga
ysrcp
jagan

More Telugu News