మహారాష్ట్ర సచివాలయంలో 13 వెయిటర్ ఉద్యోగాలు... గ్రాడ్యుయేట్లు సహా పోటీపడుతున్న 7 వేల మంది!
- విద్యార్హత కేవలం 4వ తరగతి మాత్రమే
- మహారాష్ట్రలో ఉద్యోగాల కల్పన లేదన్న ఎన్సీపీ
- దరఖాస్తుదారులను ఆపలేమన్న ప్రభుత్వం
యువకులు ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన ఆయన, రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావడం లేదన్నారు. నిర్మాణరంగంలో ఏ విధమైన ఉపాధీ లభించడం లేదని, నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాగా, ఎన్సీపీ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. ఏవైనా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే, ఎవరైనా దరఖాస్తు చేసుకుంటారని ఆర్థికమంత్రి సుధీర్ ముంగంతివార్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఎన్నో ఉద్యోగాలను కల్పించిందని అన్నారు. ఇక మహారాష్ట్ర గణాంకాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని నిరుద్యోగుల సంఖ్య ఏడాది వ్యవధిలో 33.56 లక్షల నుంచి 42.2 లక్షలకు చేరింది. ఇదే సమయంలో కొత్త ఉద్యోగాల కల్పన 17 వేలకు పడిపోయింది.