చికిత్స కోసం హఠాత్తుగా అమెరికా వెళ్లిపోయిన అరుణ్ జైట్లీ
- కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జైట్లీ
- గత మే నెలలో మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న ఆర్థిక మంత్రి
- గతంలో బేరియాట్రిక్, హార్ట్ సర్జరీలు కూడా జరిగాయి
విషయానికి వస్తే... గత మే నెలలో మూత్రపిండాల మార్పిడి సర్జరీ జరిగిన తర్వాత జైట్లీ విదేశాలకు వెళ్లలేదు. అనారోగ్య కారణాల వల్ల విదేశీ ప్రయాణాలను ఆయన రద్దు చేసుకున్నారు. గత ఏప్రిల్ లో లండన్ లో జరిగిన 10వ ఇండియా-యూకే ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ సమావేశాలకు ఆయన షెడ్యూల్ ఖరారైనప్పటికీ... కిడ్నీ సమస్యతో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. తాజాగా, మెడికల్ చెకప్ కోసమే నిన్న రాత్రి అమెరికాకు జైట్లీ వెళ్లారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 1న తన 6వ బడ్జెట్ ను, ఎన్డీయే చివరి బడ్జెట్ ను పార్లమెంటులో అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇది మధ్యంతర బడ్జెట్ మాత్రమే అయినప్పటికీ... ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ మాదిరే ఉండవచ్చని చెబుతున్నారు.