కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పై చంద్రబాబు మరోమారు స్పందన!
- వైసీపీతో కలిసి పని చేస్తామని కేసీఆర్ డైరెక్ట్ గా చెప్పొచ్చుగా?
- ఈ డొంకతిరుగుడు వ్యవహారమెందుకు?
- వైసీపీకి ఇప్పటికే కాంట్రాక్టులు ఇచ్చారు
మోదీ, కేసీఆర్.. వీళ్లిద్దరూ కలిసి దేశాన్ని మోసం చేద్దామనుకున్నారని, మోసం చేయలేకపోతున్నారని, వారికి ఎవరి నుంచీ సపోర్టు రావడం లేదని అన్నారు. ఈ అక్కసుతో తమపై పడిపోతున్నారని, ఇది తప్పు అని హితవు పలికారు. రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని కేసీఆర్ చెబుతున్నారని, వ్యవసాయ రంగంలో ఈ నాలుగేళ్లలో మీరు సాధించిన అభివృద్ధి కేవలం 0.2 శాతం మాత్రమేనని అన్నారు. ఏపీ 11 శాతం సాధించిన విషయాన్ని గుర్తుచేశారు.