39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా

టీమిండియా పేసర్ బుమ్రా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 39 ఏళ్ల నాటి రికార్డును అధిగమించాడు. మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో బుమ్రా 6 వికెట్లను పడగొట్టి ఆతిథ్య జట్టును కుప్పకూల్చాడు. ఈ నేపథ్యంలో, టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలోనే అత్యధిక వికెట్లను పడగొట్టిన భారత బౌలర్ గా అవతరించాడు.

ఇప్పటి వరకు ఈ రికార్డు లెఫ్టామ్ స్పిన్నర్ దిలీప్ దోషి పేరిట ఉంది. 1979లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన దోషి... ఆ ఏడాది 40 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టుల్లో ప్రవేశించిన చేసిన బుమ్రా ఇప్పటి వరకు 45 వికెట్లను పడగొట్టాడు. దిలీప్ దోషి తర్వాత వెంకటేష్ ప్రసాద్ 37 వికెట్లు (1996), నరేంద్ర హిర్వాణీ 36 (1988), శ్రీశాంత్ 35 (2006)లు ఉన్నారు.

bumrah
record
test
australia
team india

More Telugu News