ఇక వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తప్పనిసరి .. ఏప్రిల్ 1 నుంచి దేశ వ్యాప్తంగా అమలు!

  • పార్లమెంటులో లిఖితపూర్వకంగా తెలిపిన గడ్కరీ
  • గత ఏడాది జూన్ 5న నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి
  • ఈ నంబర్ ప్లేట్లతో నకిలీ నంబర్లకు కూడా అడ్డుకట్ట
వాహనదారులకు హెచ్చరిక. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ ట్యాంపర్ ప్రూఫ్ నంబర్ ప్లేట్లు ఉండాల్సిందే. ఈ విషయాన్ని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైతే వాటిపై అధికారిక హోలోగ్రామ్ కలిగిన స్టిక్కర్ కూడా ఉండాలని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

గత ఏడాది జూన్ 5న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని గడ్కరీ చెప్పారు. రాష్ట్రాల రవాణా శాఖలు, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్, ఆటోమోటివ్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రోడ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ ల ప్రతినిధులు కూడా ఆ సమావేశానికి హజరై, తమ ప్రతిపాదనను ఆమోదించారని చెప్పారు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల వల్ల నకిలీ నంబర్లకు కూడా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. వీటిని తొలగించడం, పునర్వినియోగించడం సాధ్యపడదని చెప్పారు. 
Go Back to Shorts
nitin gadkari
high secutiry
number plates
vehicles

More Telugu News