ఘనంగా శ్వేతాబసు ప్రసాద్ వివాహం.. ఫొటోలను అభిమానులతో పంచుకున్న నటి!
- పూణేలో ముగిసిన వివాహ వేడుకలు
- బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి
- ఫిల్మ్ మేకర్ రోహిత్ ను పెళ్లాడిన నటి
కాగా, ఈ వివాహ వేడుకలకు సంబంధించిన ఫొటోలను శ్వేతా బసు ప్రసాద్ ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఆమె భర్త రోహిత్ కూడా ‘ఇక అయిపోయింది’ అని తన పెళ్లి ఫొటోను పేస్ బుక్ లో పోస్ట్ చేశారు. మక్డీ చిత్రం ద్వారా బాలనటిగా సినీరంగంలోకి వచ్చిన శ్వేత.. ఆ సినిమాకు జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. తెలుగులో కొత్త బంగారు లోకం, కళవర్ కింగ్ సహా పలు చిత్రాల్లో శ్వేత నటించింది. ప్రస్తుతం ముంబైకే పరిమితమైన శ్వేతా బసు.. పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.