Vijay Sai Reddy: సుహాసినిని ఓడిపోయే సీటులో దింపి చంద్రబాబు అవమానించారు: విజయసాయిరెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ గా వైసీపీ నేత విజయసాయి రెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో విమర్శలు గుప్పించారు. నందమూరి సుహాసినిని ఓడిపోయే సీటులో బరిలోకి దింపి, ఆమెని అవమానించారని అన్నారు. హరికృష్ణ కుటుంబాన్ని అవమానించడానికే సుహాసినిని కూకట్ పల్లిలో పోటీకి దింపి, ఇకపై ఆ కుటుంబం నుండి ఎవరూ రాజకీయాలలోకి వచ్చే సాహసం చేయకుండా చేశారని ఎద్దేవా చేశారు. తన స్వార్థం కోసం ఇతరులని బలి చేయడం చంద్రబాబు నైజం అని దుయ్యబట్టారు.