తెలంగాణ ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగింది.. మేం ఈసీకి ఫిర్యాదు చేస్తాం!: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • మేం ఓడిపోతామని టీఆర్ఎస్ నేతలు చెప్పారు
  • కౌంటింగ్ కు ముందే వాళ్లకు ఎలా తెలిసింది
  • దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ట్యాంపరింగ్ చోటుచేసుకుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కౌంటింగ్ పూర్తికాకముందే తాము గెలుస్తామని టీఆర్ఎస్ నేతలు ప్రకటించుకోవడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోతుందని టీఆర్ఎస్ నేతలు ముందుగానే చెప్పారనీ, ఈ వ్యవహారంలో తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ లో ఈ రోజు మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు.

ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలందరూ ఆర్వో అధికారులకు ఫిర్యాదు చేయాలని ఉత్తమ్ సూచించారు. తాను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఈ విషయమై ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ నేతలు ట్యాంపరింగ్ కు పాల్పడ్డారనీ, అందుకే ఫలితాల వెల్లడి ఆలస్యమయిందని పునరుద్ఘాటించారు.
Go Back to Shorts
Telangana
tamparing
ec
complaint
Congress
Mahakutami
Uttam Kumar Reddy
allegations

More Telugu News