శ్రీకాకుళం జిల్లా రాజాం సందర్శిస్తున్న టాటా గ్రూప్‌ చైర్మన్‌ రతన్‌ టాటా

పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్‌ చైర్మన్‌ రతన్‌ టాటా శ్రీకాకుళం జిల్లా రాజాం సందర్శిస్తున్నారు. మరో ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎంఆర్‌ వరలక్ష్మీ ఫౌండేషన్‌ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు సోమవారం ఆయన వస్తున్నారు. ఈ గ్రూప్‌ రాజాం పట్టణంతోపాటు గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలను ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది.

గ్రామాలు, జీసీఎస్‌ఆర్‌, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థుల కోసం గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. రాజాంతోపాటు పరిసర గ్రామాల్లో బాలవికాస్‌ కేంద్రాలు ప్రారంభించారు. సువిధ కాంప్లెక్స్‌లు ఏర్పాటుచేసి పలు ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాల్లో కొన్నింటినైనా టాటా పరిశీలించే అవకాశం ఉంది.
Go Back to Shorts
ratan tata
gmr varalakshmi group
rajam
Srikakulam District

More Telugu News