సర్వేల సన్యాసం తీసుకునేందుకు లగడపాటి సిద్ధంగా ఉండాలి: కేటీఆర్
- తెలంగాణ రాష్ట్రం రాదని లగడపాటి చెబితే ఆగిందా?
- లగడపాటి సర్వే వివరాలు నేనూ విన్నా
- ఏం చెప్పాడో ఆయనకే అర్థమైఉండదు
ప్రత్యర్థులు తమపై ఎన్ని కూటములు కట్టినా, కుట్రలు చేసినా, ఎన్నిరకాల గారడీలు చేసినప్పటికీ ప్రజలు వాటిని పట్టించుకోకుండా, వారి చైతన్యాన్ని ప్రదర్శించారని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకూ, చివరి ఓటు లెక్క పెట్టే వరకూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.. అందరమూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలుగా చెప్పుకునే వారి అంచనాలు, కలలు కల్లలు కాబోతున్నాయని, ప్రజలు ఏకపక్షమైన తీర్పు ఇవ్వబోతున్నారని కేటీఆర్ అన్నారు.