పోలింగ్ సరళిని సమీక్షించిన కేసీఆర్.. గెలుపు తమదేనంటూ ధీమా
- పోలింగ్ సరళిపై కేసీఆర్ సంతృప్తి
- కేసీఆర్ను చూసే ఓటేశారంటున్న నేతలు
- మంత్రుల్లో అత్యధిక మంది గెలవబోతున్నారని విశ్లేషణ
పోలింగ్ సరళిని విశ్లేషించిన అనంతరం మెదక్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో అధిక సంఖ్యలో స్థానాలను చేజిక్కించుకోబోతున్నట్టు టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఖమ్మంలో పోటాపోటీ ఉంటుందని, హైదరాబాద్లోనూ మెజారిటీ స్థానాలు గెలుస్తామని అంచనాకు వచ్చింది. మంత్రుల్లో కొందరికి ప్రతికూలత ఉన్నా ఎక్కువ మంది మంత్రులు గెలవబోతున్నట్టు అంచనాకొచ్చింది. అభ్యర్థుల కంటే కేసీఆర్ను చూసే ఓటర్లు టీఆర్ఎస్కు ఓటేసినట్టు సరళని బట్టి తేల్చారు.