పోలింగ్ రోజునే 7 సినిమాల విడుదల.. శుక్రవారం నుంచి వరుస సెలవులు.. తలలు పట్టుకుంటున్న అధికారులు
- శుక్రవారం నుంచి వరుస సెలవులు
- అదే రోజున సినిమాల విడుదల
- పోలింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం
భైరవగీత, కవచం, నెక్ట్స్ ఏంటి, సువర్ణ సుందరి, శుభలేఖలు, ఇదంజగత్, సుబ్రహ్మణ్యపురం వంటి సినిమాలు ఏడో తేదీన విడుదల కాబోతున్నాయి. దీనికితోడు ఆ తర్వాత వరుసగా సెలవులు రావడం పోలింగ్పై ప్రభావం చూపుతుందని పరిశీలకులు సైతం చెబుతున్నారు. సెలవులను సద్వినియోగం చేసుకునే వేతన జీవుల్లో చాలామంది ఆ రోజు సొంతూర్లకు క్యూ కట్టే అవకాశం ఉందంటున్నారు. దాదాపు 4 లక్షల మంది వరకు సెలవులను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని, అదే జరిగితే పోలింగ్ శాతం భారీగా తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.
గత ఎన్నికల్లో హైదరాబాద్లో 53 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. అయితే, ఇలా అనుకోని సెలవులు, సినిమాల విడుదల వారి ప్రయత్నాన్ని అడ్డుకునేలా కనిపిస్తున్నాయి. అధికారులు మాత్రం భయపడేంతగా ఏమీ ఉండదని, సెలవులు, సినిమాల ప్రభావం పోలింగ్పై ఉండదని చెబుతున్నారు.