చందూలాల్, పుట్టా మధులను హత్య చేసేందుకు రంగంలోకి మావోలు.. ఒకరి అరెస్ట్!
- ములుగు, మంథని, మణుగూరులో దాడికి ప్లాన్
- రెక్కీ నిర్వహించేందుకు వచ్చి దొరికిపోయిన సభ్యుడు
- టీఆర్ఎస్ నేతలకు భారీ భద్రత కల్పించిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లో కొన్నిరోజుల క్రితం టీడీపీ నేతలు కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను పక్కా ప్రణాళికతో మావోయిస్టులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలో టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి చందూలాల్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుతో పాటు మరికొందరు టీఆర్ఎస్ నేతలను మట్టుబెట్టాలని మావోలు ప్రణాళిక రచించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
తాజాగా పోలీసులకు దొరికిన యాక్షన్ టీమ్ సభ్యుడు రెక్కీ కోసం వచ్చాడని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మిగతా యాక్షన్ టీమ్ సభ్యుల కోసం గాలింపును ముమ్మరం చేశామన్నారు. మావోల హిట్ లిస్టులో ఉన్న నేతలకు అదనపు భద్రతను కల్పిస్తామని పేర్కొన్నారు.