కోటి మందితో వాట్సాప్ గ్రూపులు రూపొందించాం: ఎంపీ కవిత
- కౌంటర్ ఇచ్చేందుకు చాలామంది ఉండేవారు
- సామాజిక మాధ్యమాల్లో యువత చాలా యాక్టివ్
- సోషల్ మీడియాను వ్యవస్థాగతంగా తీర్చిదిద్దాం
ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఉద్యమ కాలంలో తెలంగాణపై ఏ వ్యతిరేక వార్త వచ్చినా కౌంటర్ ఇచ్చేందుకు అప్పట్లో చాలా మంది నెటిజన్లు సిద్ధంగా ఉండేవారని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ యువత చాలా యాక్టివ్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాను వ్యవస్థాగతంగా తీర్చిదిద్దామని కవిత తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై అపోహలను తొలగించేలా కార్యక్రమాలు చేపడుతుంటామని తెలిపారు. దీని కోసం కోటిమందికి చేరేలా వాట్సాప్ గ్రూపులు రూపొందించినట్టు కవిత వెల్లడించారు.