మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్!
- మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలు
- మిజోరంలో 40 స్థానాలు
- ఓట్లు వేసేందుకు క్యూ కట్టిన ఓటర్లు
మధ్యప్రదేశ్ లో మొత్తం 2,899 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని, మిజోరంలో 209 మంది గెలుపు ఓటములను ఓటర్లు నేడు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. మధ్యప్రదేశ్ లో పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మిజోరంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పుడిప్పుడే పోలింగ్ బూత్ ల వద్దకు చేరుకుంటున్నారు.