అయోధ్యపై ఇంత తొందరేల?: సుప్రీంకోర్టు

  • జనవరిలో విచారిస్తామని చెప్పాం కదా?
  • ముందస్తు విచారణ ఇక ఎందుకు?
  • పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై వెంటనే విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ ను కొద్దిసేపటిక్రితం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును జనవరికి వాయిదా వేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌ కే కౌల్ ధర్మాసనం, అఖిల భారత హిందూ మహాసభ వేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది.

ఇప్పటికే కోర్టు ఈ కేసులో ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేసిన ధర్మాసనం, అప్పీళ్లన్నింటినీ జనవరిలోనే పరిశీలిస్తున్నామని, ముందస్తు విచారణకు అనుమతి నిరాకరిస్తున్నామని తెలిపింది. ఈ పిటిషన్ ను అఖిల భారత హిందూ మహాసభ తరపున న్యాయవాది బరుణ్ కుమార్ సిన్హా దాఖలు చేసి, సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయని, ఈలోగానే కేసును విచారించాలని వాదించారు.
Go Back to Shorts
Ayodhya
Ram Janmabhoomi
Babri Maszid
Supreme Court

More Telugu News