నేనూ రైతు బిడ్డనే.. జగన్ కు ఓటు వేస్తే సంకనాకి పోతారు!: ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి
- చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టుతో నీళ్లు ఇచ్చారు
- జగన్ కు ముందుచూపు అన్నది లేదు
- మరోసారి టీడీపీని గెలిపించండి
అనంతపురం సహా రాయలసీమ రైతులు చెమటోడ్చి కష్టపడటానికి సిద్ధంగా ఉన్నా, నీళ్లు లేక నీరసించిపోతున్నారని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉరవకొండ నియోజకవర్గానికి సాగునీరు తీసుకువచ్చిన నేత పయ్యావుల కేశవ్ను వచ్చే ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు లాంటి ముందు చూపున్న నాయకుడి అవసరం రాష్ట్రానికి ఉందని స్పష్టం చేశారు.
చంద్రబాబుకు విజన్, పట్టుదలతో పాటు ఏపీకి ఏదైనా చేయాలన్న కసి ఉందని వెల్లడించారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కలలు కన్న భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)లో నీళ్లు తీసుకురావడం మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి వల్లే సాధ్యమయిందన్నారు.