‘మీ టూ’ ఉద్యమం ఎఫెక్ట్.. మరో నేతపై వేటు వేసిన బీజేపీ!
- బీజేపీ కార్యదర్శి సంజయ్ పై వేధింపుల ఆరోపణలు
- చర్యలు తీసుకోవాలని సొంత వర్గం నుంచే ఒత్తిడి
- బాధ్యతల నుంచి తప్పిస్తూ బీజేపీ హైకమాండ్ ఆదేశం
ఉత్తరాఖండ్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంజయ్ కుమార్ ను బాధ్యతల నుంచి తప్పిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. కుమార్ తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళా బీజేపీ కార్యకర్త ఆరోపించిన నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఈ లైంగికవేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కుమార్ ను తప్పించాలని కోరుతూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. సొంత పార్టీ నేతలు కూడా సంజయ్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ మరింత నష్టపోకుండా బీజేపీ హైకమాండ్ తెలివిగా నిర్ణయం తీసుకుంది.