ఓటుకు నోటు కేసు.. విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
- పిటిషన్ వేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
- వాదనలు విన్న జస్టిస్ బి లోకూర్ ధర్మాసనం
- తదుపరి విచారణ ఫిబ్రవరి నెలకు వాయిదా
ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఓటుకు నోటు కేసులో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఇరువైపు వాదనలు విన్న జస్టిస్ బి లోకూర్ ధర్మాసనం తదుపరి వాదనలను ఫిబ్రవరిలో వింటామని తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి నెలకు వాయిదా వేసింది.