గోబెల్స్ కే గురువు చంద్రబాబు: రాంమాధవ్
- అగ్రిగోల్డ్ ఆస్తులను కొనేందుకు వచ్చిన సంస్థను వెనక్కి పంపించేశారు
- అవినీతిలో ఏపీ నాలుగవ స్థానంలో ఉంది
- ఏపీలో త్రిపుర ఫార్ములాను అమలు చేస్తాం
గతంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రశంసించిన చంద్రబాబు... ఇప్పుడు హోదా కోసం పోరాడుతున్నారని రాంమాధవ్ మండిపడ్డారు. గత ఎన్నికల్లో బీజేపీ లేకపోతే టీడీపీ గల్లంతయ్యేదని అన్నారు. గోబెల్స్ కు కూడా చంద్రబాబు గురువులాంటి వాడని ఎద్దేవా చేశారు. దేశంలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానంలో ఉందని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ లు రెండూ ఒకే తాను ముక్కలని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో త్రిపుర ఫార్ములాను అమలు చేస్తామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల తరహాలో ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని అన్నారు.