ఇంటిని కాపాడుకునే యత్నంలో మాల్యా.. జప్తుకు సిద్ధమవుతున్న యూబీఎస్ బ్యాంకు
- ఇంటిని తనఖా పెట్టి 26.6 మిలియన్ల రుణం
- స్వాధీనం చేసుకుంటామన్న యూబీఎస్ బ్యాంకు
- గతేడాది మార్చితో పూర్తయిన గడువు
ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే గడువుకంటే ముందే యూబీఎస్ బ్యాంకు జప్తు కోరుతోందని రోస్ క్యాపిటల్ వెంచర్స్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీనిపై కౌంటర్ ఇచ్చిన యూబీఎస్ బ్యాంకు.. కింగ్ ఫిషర్ కోసం తీసుకున్న రుణాలు మాల్యా ఉద్దేశపూర్వకంగానే ఎగవేశారని మీడియాలో వస్తున్న వార్తల వల్ల మాల్యాతో, అతని అనుబంధ సంస్థలతో సంబంధాలు తెంచుకునే ఉద్దేశంతోనే ముందస్తు జప్తు కోరుతున్నట్లు పేర్కొంది. ఈ రుణం గడువు గతేడాది మార్చితో పూర్తయిందని వెల్లడించింది.