KTR: బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరం నుంచి కేటీఆర్ కు ఆహ్వానం

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరం నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల మార్పులను చర్చించే నిమిత్తం నూతనంగా ఏర్పాటు చేయనున్న ఈ ఫోరం ప్రారంభోత్సవానికి వ్యవస్థాపక ప్రతినిధిగా ఉండాలంటూ కేటీఆర్ కు ఈ ఆహ్వానం అందింది.

వచ్చే నెల 6, 7 తేదీల్లో సింగపూర్ లో ఈ సదస్సు జరగనుంది. నగరీకరణ, పట్టణ మౌలిక వసతులు, ఐటీ అంశాలపై ఈ సదస్సులో కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఎనిమిది దేశాల నుంచి సుమారు మూడు వందల కంపెనీల ముఖ్య కార్య నిర్వాహక అధికారులు, వివిధ దేశాల రాజకీయ నాయకులు, వక్తలు హాజరుకానున్నారు. కాగా, ఈ ఆహ్వానంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
KTR
bloom berg new economy forum
invitation

More Telugu News