శ్రీలంకలో పెద్ద ఎత్తున బయటపడ్డ అస్థిపంజరాలు

  • 150కి పైగా అస్థిపంజరాలు 
  • అంతర్యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారివిగా అనుమానం
  • మన్నార్ జిల్లాలో బయటపడ్డ అస్థిపంజరాలు
శ్రీలంకలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న మన్నార్ జిల్లాలో అస్థిపంజరాలు కుప్పలుతెప్పలుగా బయటపడటం కలకలం రేపుతోంది. 150కి పైగా అస్థిపంజరాలను కనుగొన్నట్టు శ్రీలంక అధికారులు తెలిపారు. మన్నార్ మేజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించి ఓ గదిని నిర్మించేందుకు పనులు జరుగుతున్నాయి. పాత కోఆపరేటివ్ స్టోర్ స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించేందుకు తవ్వకాలను చేపట్టగా... ఈ అస్థిపంజరాలు బయటపడ్డాయి. 1983 నుంచి 2009 మధ్య కాలంలో ఈ ప్రాంతం ఎల్టీటీఈ అధీనంలో ఉంది. 30 ఏళ్ల క్రితం జరిగిన అంతర్యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్న వారి అస్థిపంజరాలుగా వీటిని భావిస్తున్నారు. 1990లో దాదాపు 25వేల మంది కనిపించకుండా పోయారనే వార్తలు అప్పట్లో వెలువడ్డాయి. 
Go Back to Shorts
Sri Lanka
skeleton
mannar
ltte

More Telugu News