జయలలిత వారసుల వివరాలు ఇవ్వండి: మద్రాస్ హైకోర్టు ఆదేశం
- ఆదాయ పన్ను శాఖను కోరిన మద్రాస్ హైకోర్టు
- ఆస్తిపన్ను వ్యాజ్యం విచారణ సందర్భంగా ఆదేశం
- ఇరవై ఏళ్ల క్రితం నుంచి కోర్టులో నడుస్తున్న కేసు
2000 మార్చి నాటికి జయలలిత ఆస్తుల విలువ రూ.4.67 కోట్లని మొదట ఆదాయపన్ను శాఖ నిర్ణయించింది. నిఘా, అవినీతి నిరోధక విభాగం పరిశీలన తర్వాత మరికొన్నింటిని చేర్చారు. దీనిపై అప్పట్లో జయలలిత అప్పీల్ చేయగా విచారించిన ట్రైబ్యునల్ అదనంగా చేర్చిన ఆస్తుల అంచనాను కొట్టేసింది. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమంటూ ఆదాయ పన్నుశాఖ హైకోర్టులో సవాల్ చేయడంతో ప్రస్తుతం వ్యాజ్యం నడుస్తోంది.