టెలికాం కంపెనీలకు భారీ జరిమానా విధించిన ట్రాయ్
- వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో విఫలం
- కన్నెర్ర చేసిన టెలికాం రెగ్యులేటరీ
- జియో, ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ లకు జరిమానా
2017 అక్టోబర్ 1 నుంచి సేవల ప్రమాణాలను ట్రాయ్ కఠినతరం చేసింది. జనవరి-మార్చి నెలల మధ్య కాలంలో సేవల లోపాలకు సంబంధించి పెనాల్టీని విధించింది. జియోకు రూ. 34 లక్షలు, ఎయిర్ టెల్ కు రూ. 11 లక్షలు, ఐడియాకు రూ. 12.5 లక్షలు, వొడాఫోన్ కు రూ. 4 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ జరిమానాలపై సదరు టెలికాం కంపెనీల ప్రతినిధులు ఇంకా స్పందించలేదు.