ఉద్యోగమిచ్చి ఆదుకుంటే కిలో బంగారంతో పరారైన ఉద్యోగి!
- నెల రోజుల క్రితమే ఉద్యోగంలో చేరిన యువకుడు
- కిలో నగలతో పరారీ
- నిందితుడి కోసం పోలీసుల గాలింపు
అదును కోసం ఎదురుచూస్తున్న వీరేందర్కు సోమవారం కలిసొచ్చింది. తోటి ఉద్యోగి సెలవు పెట్టాడు. యజమానికి బదులుగా ఆయన కుమారుడు దుకాణానికి వచ్చాడు. దాంతో వీరేందర్ తన ఆలోచనను అమలు చేశాడు. దొరికిన నగలను దొరికినట్టు తన జేబులో వేసుకున్న నిందితుడు మూత్ర విసర్జన కోసం వెళుతున్నట్టు చెప్పి పరారయ్యాడు. బయటకు వెళ్లిన వీరేందర్ ఎంతకూ షాపుకు రాకపోవడంతో అనుమానం వచ్చిన దుకాణం యజమాని షాపులో పరిశీలించగా దాదాపు కిలోబంగారం నగలు కనిపించలేదు. అశోక్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.