నా సోదరుడు తారక్ కు, అతని కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా: మహేష్ బాబు

  • హరికృష్ణ మరణ వార్త ఎంతగానో కలచి వేసింది
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
  • ట్విట్టర్ ద్వారా స్పందించిన మహేష్ బాబు
నందమూరి హరికృష్ణ మరణంతో తెలుగు ప్రజలంతా షాక్ కు గురయ్యారు. ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఆయన మృతి పట్ల హీరో మహేష్ బాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. 'హరికృష్ణ గారు హఠాన్మరణం చెందారన్న వార్త నన్ను ఎంతగానో కలచి వేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. నా సోదరుడు తారక్ కు, అతని కుటుంబసభ్యులకు ఈ విషాదకర సమయంలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశాడు. 
Go Back to Shorts
hari krishna
Mahesh Babu
tollywood

More Telugu News