కేసీఆర్ సర్కారు వైఖరికి నిరసనగా బాల్కొండ మండల ప్రజాప్రతినిధుల రాజీనామా
- ఎస్సారెస్పీ రైతులకు మద్దతుగా కొన్ని రోజులుగా ఆందోళన
- ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడంతో రాజీనామా
- నీళ్లు అడిగిన రైతులపైకి పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆరోపణ
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటిని అడిగిన ఎస్సారెస్పీ రైతులను ప్రభుత్వం నక్సలైట్లలా చూస్తోందని ఆరోపించారు. సాగునీరు కోసం ఆందోళన చేస్తున్న రైతులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోందని ఆరోపించారు. వెంటనే రైతులకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.