లండన్ కోర్టులో మాల్యాకు ఊరట.. బెయిల్ పొడిగింపు!
- మాల్యాకు బెయిల్ పొడిగించిన వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు
- ముంబై ఆర్థర్ రోడ్డులోని జైలు వీడియో సమర్పించాలంటూ భారత ప్రభుత్వానికి విన్నపం
- తదుపరి విచారణ సెప్టెంబర్ 12కు వాయిదా
ఈ సందర్భంగా మీడియాతో మాల్యా మాట్లాడుతూ, తాను డబ్బును అక్రమంగా విదేశాలకు తరలించానన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. బ్యాంకులకు డబ్బు చెల్లించాలని కోర్టు ఆదేశిస్తే... చెల్లించడానికి తాను సిద్ధమని అన్నారు. తనకు ఉన్న రూ. 14 వేల కోట్ల ఆస్తులను అమ్మకానికి పెట్టి రుణాలను చెల్లిస్తానని చెప్పారు.