Kathi Mahesh: కత్తి మహేశ్ వ్యాఖ్యలపై విజయవాడలో కేసు నమోదు!

కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టే విధంగా కత్తి మహేశ్ వ్యాఖ్యానిస్తున్నారనే ఫిర్యాదు నేపథ్యంలో ఆయనపై విజయవాడలో పోలీస్ కేసు నమోదైంది. విజయ్ కుమార్ అనే వ్యక్తి సత్యనారాయణపురం పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. మనస్పర్థలు సృష్టించేలా కత్తి వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. పలు సెక్షన్ల కింద కత్తి మహేశ్ పై కేసు నమోదు చేసినట్టు సమాచారం. కాగా, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కత్తి మహేశ్ హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే.
Kathi Mahesh
Vijayawada

More Telugu News