విదేశీ టూరిస్టులకు భారత ప్రభుత్వం షాక్.. ఉచిత సిమ్ కార్డుల పంపిణీ నిలిపివేత
- ఉచిత సిమ్ కార్డుల స్కీమ్ను ఎత్తివేసిన ప్రభుత్వం
- అవసరం లేదని భావించే తీసేసినట్టు చెప్పిన పర్యాటక శాఖ కార్యదర్శి
- పబ్లిక్ వైఫై, యాప్స్ అందుబాటులో ఉండడమే కారణం
పర్యాటకుల్లో దాదాపు అందరూ సోషల్ మీడియా యాప్స్ను వాడుతున్నారని, అలాగే, విమానాశ్రయాలు సహా చాలా ప్రాంతాల్లో పబ్లిక్ వైఫై అందుబాటులో ఉండడంతో దానిని ఉపయోగించుకుని వారి కుటుంబాలతో నిత్యం టచ్లో ఉంటున్నారని వర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో సిమ్ల అవసరం లేదని గుర్తించి ఈ పథకాన్ని ఎత్తివేసినట్టు వివరించారు.
ఈ పథకంలో భాగంగా 50 రూపాయల టాక్టైమ్, 50 ఎంబీల డేటా, 30 రోజుల కాలపరిమితితో కూడిన బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులను విదేశీ పర్యాటకులకు అందించేవారు. అలాగే, 12 భాషల్లో 24 గంటలూ టూరిస్ట్ హెల్ప్ లైన్కు అందుబాటులో ఉండే సౌకర్యం వీటిలో ఉండేది. కాగా, గతేడాది తొలిసారి భారత్ సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య కోటి దాటింది.