ఇకపై విచారణల లైవ్ స్ట్రీమింగ్... సుప్రీంకోర్టు కీలక రూలింగ్!
- సమ్మతి తెలిపిన కేంద్రం
- న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్న సీజే
- త్వరలోనే ప్రారంభం కానున్న ప్రత్యక్ష ప్రసారాలు
వేణుగోపాల్ వాదనలు విన్న తరువాత సీజే దీపక్ మిశ్రా స్పందిస్తూ, తన ముందు జరిగే విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఎటువంటి అభ్యంతరమూ లేదని చెప్పారు. కాగా, గత సంవత్సరం ట్రయల్ కోర్టుల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం జనవరిలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్, ఓ పిటిషన్ దాఖలు చేస్తూ, విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని కోరారు. దీనిపై విచారించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని స్పందించాలని కోరింది.