సీబీఎస్ కుప్పకూలడంపై నిజాం వారసుల ఆగ్రహం... విచారణకు డిమాండ్!
- హైదరాబాద్ లో చారిత్రక కట్టడాలు చాలానే ఉన్నాయి
- నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయండి
- డిమాండ్ చేసిన నవాబ్ నజాఫ్ అలీ ఖాన్
నగరంలో చారిత్రక, పురాతన కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించిన ఆయన, సామాన్యుల సంక్షేమం కోసం కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం, పురాతన కట్టడాలను సంరక్షించడానికి కూడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీబీఎస్ కుప్పకూలిన వ్యవహారంలో నిజ నిర్ధారణ కమిటీని నియమించాలని, చారిత్రక నేపథ్యమున్న కట్టడాల పరిస్థితిపై నివేదిక తయారు చేయించాలని కోరారు. పాతబడ్డాయన్న కారణంతో కొన్ని కట్టడాలను తొలగించాలన్న ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని సూచించారు.