ఒక్క రూపాయి తగ్గిందంటూ.. కుదువ పెట్టిన బంగారాన్ని తిరిగి ఇచ్చేందుకు నిరాకరించిన బ్యాంకు!
- కాంచీపురం సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు నిర్వాకం
- హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాధితుడు
- అసలు నగలు ఉన్నాయా? లేవా? అంటూ అనుమానం
ఈ నేపథ్యంలో, బాధితుడు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గత ఐదేళ్లుగా తన నగలను ఇవ్వకుండా బ్యాంకు సిబ్బంది తనను వేదనకు గురి చేస్తున్నారంటూ పిటిషన్ లో తెలిపాడు. పిటిషన్ విచారణ సందర్భంగా బాధితుడి తరపు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ, తన క్లయింట్ కు నగలను బ్యాంకు తిరిగి ఇవ్వడం లేదని... పెండింగ్ ఉన్న రెండు రూపాయలను తీసుకోవడానికి కూడా నిరాకరిస్తోందని తెలిపారు. అంతేకాదు, తన క్లయింటు నగలు అసలు బ్యాంకులో ఉన్నాయా? లేవా? అనే అనుమానాన్ని కూడా లేవనెత్తారు. వాదనలను విన్న జస్టిస్ టి.రాజా, రెండు వారాల్లోగా సంబంధిత అధికారుల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి, సమర్పించాల్సిందిగా ప్రభుత్వ అడ్వొకేట్ కు ఆదేశాలు జారీ చేశారు.