తెలంగాణ మంత్రి హరీష్ రావు కాన్వాయ్ ను అడ్డుకున్న రైతులు!
- సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఘటన
- హరీష్ ను అడ్డుకున్న రైతులు, కాంగ్రెస్ నేతలు
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
చందుర్తి మండలానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ మంత్రి కాన్వాయ్ ను రైతులు ఆపేశారు. ఫ్లెక్సీలతో రోడ్డుపైకి వచ్చి, హరీష్ రావును అడ్డుకున్నారు. సాగు, తాగునీరును అందించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో, రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం హరీష్ రావు కాన్వాయ్ ను అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ, తమను పట్టించుకోకుండానే మంత్రి వెళ్లిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.