మోదీపై కుట్ర వార్త తెలిసి తీవ్ర ఆవేదన చెందాను: బాబా రామ్ దేవ్

  • ఉన్నత స్థాయి దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించాలి
  • ఈ దర్యాప్తునకు అన్ని రాజకీయపార్టీలు సహకరించాలి
  • ఈ దేశ వారసత్వ సంపద మోదీ
ప్రధాని నరేంద్ర మోదీని హత మార్చేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారన్న వార్త తెలిసి తీవ్ర ఆవేదన చెందానని ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ అన్నారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించాలని కోరారు. ఈ దర్యాప్తునకు అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గురించి ఆయన గొప్పగా చెప్పారు. ఈ దేశ వారసత్వ సంపద మోదీ అని, శతాబ్దాల తర్వాత మోదీ లాంటి వ్యక్తి బయటకొచ్చారని ప్రశంసించారు.
Go Back to Shorts
modi
ramdev baba

More Telugu News