బీజేపీ శిబిరంలోని కాంగ్రెస్ నేతలను ఎలా రప్పించామంటే...!: వెల్లడించిన డీకే శివకుమార్
- ఎమ్మెల్యేలుగా గెలవగానే మాయమైన ఇద్దరు కాంగ్రెస్ నేతలు
- రంగంలోకి దిగిన శివకుమార్
- వారిని తిరిగి కాంగ్రెస్ శిబిరానికి చేర్చడంలో కీలక పాత్ర
వీరిద్దరూ ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని పసిగట్టి, వారి మనసును మార్చగలిగారు. గత శనివారం నాడు అసెంబ్లీ ప్రారంభమైన తరువాత మధ్యాహ్నం వరకూ వీరిద్దరూ అసెంబ్లీకి రాకపోవడానికి కూడా శివకుమార్ మంత్రాంగమే కారణమని తెలుస్తోంది. ఇక వీరిద్దరినీ ఎలా తిరిగి కాంగ్రెస్ దగ్గరికి చేర్చామన్న విషయమై స్పందించిన శివకుమార్, "దేవుడు నాకో మంత్రదండాన్ని ఇచ్చాడులే. దాన్ని ఉపయోగించా" అని సరదాగా వ్యాఖ్యానించారు.
"బీజేపీ స్నేహితులు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకెళ్లారని తెలిసింది. ఆపై నాకున్న వనరుల ద్వారా వారు ఎక్కడున్నారో కనిపెట్టాను. వారితో ఎప్పటికప్పుడు మాట్లాడాను. వారిని బీజేపీ బలవంతం చేసింది. ఇందులో రహస్యం ఏమీ లేదు. బీజేపీ రాజకీయాలు ఆడింది. మేము మా స్టయిల్ లో అవే రాజకీయ ఆటలు ఆడాం" అని అన్నారు. బల పరీక్షకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువును సుప్రీంకోర్టు 24 గంటలకు కుదించడంతోనే తమ విజయం ఖాయమై పోయిందని శివకుమార్ అభిప్రాయపడ్డారు.