Kathi Mahesh: పవన్ ఫ్యాన్స్ ఎఫెక్ట్... కత్తి మహేష్ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్!

  • కత్తి మహేష్ పై లక్షలాది ఫిర్యాదులు
  • నా ఖాతాలు బ్లాక్ చేయించారన్న కత్తి
  • ఇంత భయమైతే ఎలాగంటూ ఎద్దేవా
గత కొంతకాలంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకుని పలు విమర్శలు చేసి వార్తల్లోకి ఎక్కిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ అయ్యాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ లోని తన ఖాతాలను బ్లాక్ చేశారని కత్తి మహేష్ స్వయంగా వెల్లడించారు. పవన్ ఫ్యాన్స్ తన ఖాతాలపై లక్షలాది రిపోర్టులను ఫేస్ బుక్, ట్విట్టర్ లకు పంపించారని, అందువల్లనే వాటిని బ్లాక్ చేశారని ఆరోపించారు.

తన మాటలు ఆగవని, తన నోరు మూతపడబోదని హెచ్చరించారు. తన అభిప్రాయాలను వ్యతిరేకిస్తే భరించలేని అభిమానులను కలిగివుండటం ఛీ అనిపిస్తోందని అన్నారు. ఇంత భయమైతే ఎలాగంటూ ప్రశ్నించారు. ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలు లేకపోయినా ఫర్వాలేదని అన్నారు. "ఏం ట్వీటమరాయుడో, ఏం కాటమరాయుడో, ఏం పవర్ స్టార్ పవన్ కళ్యాణో నాకు అర్థం కావడం లేదు" అని వ్యాఖ్యానించారు.
Kathi Mahesh
Pawan Kalyan
Fans
Facebook
Twitter
Block

More Telugu News