అమెరికా నుంచి కిల్లర్ డ్రోన్స్ ను కొనుగోలు చేయనున్న భారత్!
- సరిహద్దుల్లో గస్తీ కోసం యూఏవీల కొనుగోలు
- పాక్, చైనాలతో సరిహద్దుల్లో సవాళ్లను ఎదుర్కొనేందుకు యూఏవీల కొనుగోళ్లు
- ప్రిడేటర్ బి డ్రోన్లను కొనుగోలు చేయనున్న భారత్
ఈ డ్రోన్స్ ను భారత్ కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. వీటిని కొనుగోలు చేయడం ద్వారా సరిహద్దుల్లో పాక్, చైనాలతో ఎదురవుతున్న సవాళ్లకు చెక్ చెప్పొచ్చని భారత్ భావిస్తోంది. టెర్రరిస్టు చొరబాట్లను కూడా అడ్డుకోవడంలో ఈ కిల్లర్ డ్రోన్స్ ప్రభావంతమైన పాత్ర పోషిస్తాయని భారత్ ఆశిస్తోంది. అంతే కాకుండా 22 ప్రిడేటర్ బి డ్రోన్లను కొనుగోలు చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ డ్రోన్ల ద్వారా నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయొచ్చని భారత్ భావిస్తోంది. అంతర్జాతీయ న్యాయ చట్టాలను అనుసరించి, దేశ రక్షణలో వీటిని వినియోగించొచ్చునని సమాచారం.