kodel siva prasad: సైకిల్ యాత్ర చేస్తున్న కోడెలను ఢీకొన్న ద్విచక్రవాహనం

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేపట్టిన సైకిల్ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు చేపడుతున్న నిరాహారదీక్షకు మద్దతుగా నరసరావుపేట నుంచి కోటప్పకొండకు కోడెల ఈ ఉదయం సైకిల్ యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

సైకిల్ యాత్ర కొనసాగుతున్న సమయంలో యలమంద వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి కోడెల సైకిల్ ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో కోడెల కిందకు పడిపోయారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. పక్కనే ఉన్న నేతలంతా ఆయనను పైకి లేపి, సపర్యలు చేశారు. కాసేపు సేదదీరిన అనంతరం కోడెల తన యాత్రను కొనసాగించారు.

kodel siva prasad
cycle rally
accident
Chandrababu

More Telugu News